సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమాన్నిఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ వద్ద మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సామూహికంగా జాతీయ గీతం ఆలపించారు. అంతకుముందు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో మహానీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమం నిర్వహించగా స్ధానిక నేతాజీ చౌక్లోని నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ నీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ సమైక్యత పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. బాధ్యతగల పౌరులు వారి ఇండ్లపై జాతీయ జెండాలను ఎగరవేసి సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మానంద్, ఆదినాథ్, ఆకుల ప్రవీణ్, లాలమున్న, జోగు రవి, కృష్ణ యాదవ్ రఘుపతి, బోయర్ విజయ్, వేదవ్యాస్, రాజేష్ ధోని జ్యోతి, శ్రీనివాస్ ముకుందరావు, సుభాష్., తదితరులు పాల్గొన్నారు.