సిరాన్యూస్: ఆదిలాబాద్
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
* కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు భరత్, సంజయ్, నెమలికొండ కరుణ (మిషు) శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి బీజేపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు లాలా మున్న, ఆకుల ప్రవీణ్, సోమ రవి, నగేష్, వ్యాస్, సచిన్, రాజు తదితరులు ఉన్నారు.