MLA Payal Shankar in Shobhayathra: భద్రాచలం తలంబ్రాల శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

భద్రాచలం తలంబ్రాల శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌
+ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పండగాల జరుపుకోవాలని పిలుపు
+ 22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి వినతి

భద్రాచలం ముత్యాల తలంబ్రాల శోభాయాత్ర కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పాల్గొన్నారు. భద్రాచలం నుండి అయోధ్య రాజజన్మ భూమికి వెళ్తున్న ముత్యాల తలంబ్రాలకు శనివారం పట్టణంలోని గోపాల కృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తలంబ్రాలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు ఒక పండుగలా జరుపుకోవాలన్నారు. దేశ ప్రధాని నరేంధ్ర మోడీ నేతృత్వంలో హిందువుల ఏండ్ల కల నెరవేరబోతున్నదని ఆయన అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సెలవు ప్రకటించడం జర్గిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ సెలవు ప్రకటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *