సిరా న్యూస్, జైనథ్:
రైతు సంక్షేమమే ధ్యేయంగా…
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ ముందుకుపోతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటాకు ప్రత్యేక పూజలు చేసి, రైతులను శాలువాలతో సత్కరించి, కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు మద్దతు ధర అందేలా ఎప్పటికప్పుడు కేంద్రం చర్యలు తీసుకుటుందని అన్నారు. రైతులు పండించిన పంటలను నాఫెడ్, మార్క్ఫెడ్ వంటి సంస్థల చేత కొనుగోలు చేయిస్తోందని అన్నారు. ఈ ఏడాది ఆదిలాబాద్లో 50వేల క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు ఎవరూ కూడ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మెన్ బాలురి గోవర్ధన్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మెన్ వేణుగోపాల్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.