సిరా న్యూస్,పెనమలూరు;
గండిగుంట గ్రామంలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గోన్నారు. స్వయంగా అవ్వ తాతలకు పెన్షన్ పంపిణీ చేసారు.ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు పెంచడం జరిగింది. తమ ప్రభుత్వంలో శాశ్వత అంగవైకల్యం మంచానికే పరిమితమైన వారికి 15 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా మొదటి తారీకునే జీతం వస్తుందో అలాగే మొదటి తారీకు ని పెన్షన్లు కూడా వారి ఇంటి వద్దకి పంపిణీ జరుగుతుందని అన్నారు. పెరిగిన నిత్యవసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.