సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సోమవారం నాడు ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వేద వాయిద్యాలతో, పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామీ వారి ప్రతిమను బహూకరించి స్వామీ వారి ప్రసాదాన్ని అందించారు.
తరువాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దేవస్థాన అభివృధి తన వంతు సహాయ సహకారాలు అందించి అభివృధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు..