భైంసా, సిరాన్యూస్
సన్మానించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
సామాజిక సేవలో ఎంతో సంతోషం ఉంటుందని నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అభిప్రాయపడ్డారు. భైంసాలో కడారి నరేష్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచినందున ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలనే తపన అందరికి ఉండదు. ఎన్నో రెట్లు డబ్బున్నా వాటిని సద్వినియోగం చేసుకోకుండా బ్యాంకుల్లో మూలిగేలా చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజేశ్వర్, హల్ద సర్పంచ్ సాయినాథ్, పెంచికల్ పాడ్ సర్పంచ్ దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.