MLA Ramarao Patel: గొడిసెర సాగునీటి గోసను తీర్చాలని వినతి…

సిరా న్యూస్, లోకేశ్వరం:

గొడిసెర సాగునీటి గోసను తీర్చాలని వినతి…

– ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిసిన గ్రామస్తులు

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గొడిసెర గ్రామానికి బ్రహ్మేశ్వర ఎత్తిపోతల పథకం నుండి సాగునీటిని అందించాలని గ్రామస్తులు కోరారు. శుక్రవారం ఈ మేరకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో పూర్వకంగా కలుసుకొని తమ గ్రామ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోచంప్యాడ్ ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన గొడిసెర గ్రామానికి సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోని సాగునీటి సమస్య గురించి అధికారులు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. తమ గ్రామానికి ఎత్తిపోతల పథకం నుండి సాగునీటిని అందించి రైతులకు న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే సాగునీటి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఈ సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *