సిరా న్యూస్,కడప;
ఎన్నికల ప్రచారంలో బెదిరింపులు పర్వానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెర లేపారు. మంగళవారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మూడో వార్డులో అయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి, ఆమె భర్త రామాంజనేయరెడ్డి ప్రచారానికి రాకపోవడంతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లారు. భర్త ఇంట్లో లేని సమయంలో సొంత పార్టీ కౌన్సిలర్ కే బెదిరింపులకు గురి తీసారు. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా నువ్వు నీ భర్త టిడిపిలో చేరితే మీ కథ చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. నేరుగా నేను ఇంటికి వచ్చి మీ అంతు చూస్తానని బెదిరించారని సమాచారం. గత కొంతకాలంగా కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆమె భర్త రామాంజనేయరెడ్డి ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్రానరు. ఎమ్మెల్యే బెదిరింపు ఆడియో బయటకు వచ్చింది. దాని ఆధారంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి కౌన్సిలర్ సిద్దమయ్యారు