సిరాన్యూస్, ఉట్నూర్
క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి 10 వేలు అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్
క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ బాసటగా నిలిచారు.చికిత్స కోసం ఆర్ధిక సహాయం అందించి మానవత్వాన్ని చాట్టుకొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని జైత్రామ్ తాండా కు చెందిన ఉప్పారే రమేష్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయనకు ఆపరేషన్ చేశారు. అయితే కిమో చేయానిదే రోగం నయం కాదని డాక్టర్లు చెప్పడంతో కిమో కోసం హైదరాబాద్ వెళ్ళడానికి వారి వద్ద డబ్బులు లేకపోవడంతో సోమవారం రమేష్ కుటుంబ సభ్యులు ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ ను కలిశారు. తమ దీన పరిస్థితిని చెప్పుకొని కన్నీటి పర్యంత మయ్యారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తక్షణ సహాయంగా వారికి రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించి ఆస్పత్రికి పంపించారు.