సిరా న్యూస్, దస్తురాబాద్:
గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ముందుకు… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంతోపాటు అకొండపేట్, మున్యాల్ భూత్కూర్, బుట్టాపూర్, రేవోజీపేట, గోడిసీరియల్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులతో కలిసి సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని అన్నారు. అన్ని గ్రామాల్లో దశలవారీగా మౌలిక వసతులు కల్పించడంతోపాటు, అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుర్గం మల్లేష్, యూత్ ప్రసిడెంట్ గుండా నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.