సిరా న్యూస్, ఇంద్రవెల్లి
కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాలకు న్యాయం
*సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి
*ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
*అభివృద్ధి పనులకు భూమి పూజ
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని గోండుగూడా(ఎస్టీ కాలని), వడ్డెర గల్లీ, భీంనగర్, ప్రబుద్ధనగర్, సట్వాజీగూడా, మర్కగూడా, బుర్సన్ పటార్, పిప్రి గ్రామాల్లో సిసి రోడ్డులు, మురికి కాలువలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత పాలకుల నిర్లక్ష్యంగా గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న దిర్ఘకాలికా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అర్క పుష్పలత,కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.