సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
భవిష్యత్ తరాల కోసం మొక్కలను నాటుదాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి మహావృక్షమయ్యే వరకు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ పీల్డ్ స్టేడియంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల జీవరాసులకు స్వేచ్ఛమైన ప్రాణవాయువును అందించే చెట్లను నరకకుండా ఉండాలని,అప్పుడే ప్రకృతి వైపరీత్యాలను అరికట్టగలమని పేర్కొన్నారు. రసాయనాల వాడకం తగ్గించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు.మనిషి తప్పిదాల వల్లే ప్రకృతి నాశనం అవుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటాల్సిన ఆవశ్యక్యత ఎంతైన ఉందని తెలిపారు. వృక్షాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.