MLA Vedma Bojju Patel: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, ఉట్నూర్
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ల‌బ్దిదారుల‌కు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి పాటు పడుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 1 లక్షలోపు గల రుణాన్ని మాఫీ చేయడం జరిగిందని తెలిపారు.రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపడుచులకు వరమన్నారు. త్వరలో లక్ష రూపాయాలతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. అధికారులు ప్రజలతో కలసి మెలసి ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.వర్ష కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలని సూచించారు. శనివారం ఉదయం 8 గంటల నుండి 11గంటల వరకు ఎమ్మెల్యే తో ఫోన్ ఇన్ విత్ పీపుల్ కార్యక్రమం ఉంటుందని, సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకోరావాలన్నారు.గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *