MLA Vedma Bojju Patel: బ్యాంకు అధికారులు రైతులకు ఇబ్బంది పెట్టొద్దు:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఉట్నూర్
బ్యాంకు అధికారులు రైతులకు ఇబ్బంది పెట్టొద్దు:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంద‌ర్శ‌న‌

బ్యాంకు అధికారులు రైతులకు ఇబ్బంది పెట్టొద్దని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.సోమవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల పరిధిలోని రైతులు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను కలిశారు.ఈ సందర్బంగా బ్యాంకు అధికారులు రుణమాఫీ విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ గోడును ఎమ్మెల్యేకు వినిపించారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ను ఆకస్మికంగా సందర్శించారు.బ్యాంక్ మేనేజర్ తో పాటు సంబందిత బ్యాంకు ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను తెలిపారు.సమస్యలు పరిష్కారం చేయాలనీ సూచించారు.ఈ సందర్బంగా రుణమాఫీ అయిన రైతుల లిస్ట్ను పరిశీలించారు.ఈ ప్రాంత రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమా చేయాలని సూచించారు. దళారులు బ్యాంకు వ్యవహారాలలో జ్యోక్యం చేయకుండా అలాంటీ వారిపై పటిష్ట నిఘా ఉంచాలని పేర్కొన్నారు.రుణమాఫీ కానీ రైతులు దిగులు చెందోద్దని,ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.ఎజెన్సీ ప్రాంతంలో రైతులు పహాణిల ద్వారా రుణాలను పొందేవారని అలాంటి వారికీ రైతు రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.వారి వెంట మండల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *