సిరాన్యూస్,దస్తురాబాద్
ఐటీడీఏ ఏపీఓ పెందూర్ భీంరావ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామవాసి భద్రాచలం ఐటీడీఏ ఏపిఓగా విధులు నిర్వహిస్తూ అకాలంగా మృతి చెందిన పెందుర్ భీంరావ్ అంత్యక్రియలలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం పాల్గొన్నారు. ముందుగా వారి భౌతిక ఖాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పెందుర్ భీంరావ్ గతంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో విధులు నిర్వర్తించి ఈ ప్రాంతానికి మంచి సేవలను అందించారని గుర్తు చేశారు.ఏజేన్సీ ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవారని పేర్కొన్నారు.వారి మృతి సమాజానికి తీరని లోటని అన్నారు. ఈ సందర్బంగా మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.