సిరాన్యూస్, ఉట్నూర్ :
నిరంతరం సేవ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఎమ్మెల్యేను కలిసిన నాగచైతన్య తండ్రి మొగలి
విద్యుత్ ఘాతంలో తమ కొడుకు నాగచైతన్య కాళ్ళు పూర్తిగా పాడుకాగా మానవతా దృక్పథంతో స్పందించి చిద్రాల చారిటేబుల్ ట్రస్ట్ సహకారంతో కృత్రిమ కాలు అమర్చినందుకు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు జీవితాంతం రుణపడి ఉంటామని నాగచైతన్య తండ్రి మొగలి అన్నారు. బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాద పూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు, బాధలు తెలుసని, కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉంటానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నాగచైతన్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.