సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి: ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
* ఘనంగా ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాల ఫ్రెషర్స్ డే
విద్యార్థులు తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో గురువారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలన్నారు. మనకు విద్య బోధన చేస్తున్న గురువులను గౌరవించాలని తెలిపారు. చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడావలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్, కౌన్సిలర్స్, నాయకులు పరిమి సురేష్ , అమనుల్లా ఖాన్ , షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ ,మండల అధ్యక్షులు దోనికేని దయానంద్, పి,ఎ,సి,ఎస్, చైర్మల్లు ,ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, అమంద శ్రీను, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.