సిరాన్యూస్, ఉట్నూర్
ఫూలాజీ బాబా జయంతికి నిధులు మంజూరయ్యేలా కృషి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఎమ్మెల్యేను కలిసిన అంద్ ఆదివాసీ సంఘం సభ్యులు
సద్గురు శ్రీ ఫూలాజీ బాబా జయంతి వేడుకలకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో ఈనెల 29, 30 తేదీలలో కొమరం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామంలో నిర్వహించే సద్గురు శ్రీ ఫూలాజీ బాబా జయంతి ఉత్సవాలకు నిధులు మంజూరు చేయాలని బుధవారం అంద్ ఆదివాసీ సంఘం నాయకులు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు శ్రీ ఫూలాజీ బాబా జయంతి వేడుకలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.శాతాప్ది జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నైపథ్యంలో కమిటీ విన్నపం మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,జిల్లా మంత్రి సీతక్క, ట్రైబల్ సెక్రటరీ-కమిషనర్ కు జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా వారితో మాట్లాడతామని తెలిపారు.రెండు రోజులపాటు ఆర్టీసీ బస్సులు, మెడికల్ క్యాంపు,ఆర్టీసీ మొబైల్ మరుగుదొడ్లు 2, ఐటీడీఎ పిఓతో మాట్లాడి ఉత్సవాలకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంద్ ఆదివాసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.