MLA Vedma Bojju Patel: మట్టి గణనాథుల విగ్రహాలను ప్ర‌తిష్టించాలి:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, దస్తురాబాద్
మట్టి గణనాథుల విగ్రహాలను ప్ర‌తిష్టించాలి:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* దేశభక్తి గీతం సీడీ ఆవిష్కరణ

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని,వచ్చే నెలలో వినాయక నవరాత్రులలో మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టాపించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం నిర్మ‌ల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో దేశభక్తి పాట సీడీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భూమి మీద పెరుగుతున్న కాలుష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టర్ అఫ్ ఫ్యారీస్ గణేష్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్టాపించి పూజించాలన్నారు. ప్రకృతిలో లభించే సహజ సిద్దమైన వనరులతో మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి భక్తులకు విజ్ఞప్తి చేశారు.1996 సంవత్సరంలో తన సొంత గ్రామమైన కల్లూరుగూడాలో మిత్రులతో కలసి మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి పూజించే వాళ్ళమని గుర్తు చేశారు.పర్యావరణ కాలుష్యం జరగకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మినరసింహ ఆలయ పూజారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *