MLA Vedma Bojju Patel: సీఎల్పీ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌,ఖానాపూర్‌
సీఎల్పీ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ను కలిసిన ఎమ్మెల్యే

హైదరాబాదులోని నానకరాంగూడాలోని షెరటాన్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పి సమావేశంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు,ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు.ఈ సందర్బంగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ని సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీను పరిచయం చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ , అభిషేక్ మను సింఘ్వీను మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *