సిరాన్యూస్, ఉట్నూర్
జి.చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారాం గ్రామ పంచాయతీకి చెందిన జి.చంద్రయ్య ఇటీవల బ్రెన్ స్ట్రోక్ తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ వారి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.