MLA Vedma Bojju Patel: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం రెండు లక్షలు రుణమాఫీ చేసిన సందర్భంగా సోమవారం నిర్మ‌ల్‌ ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణతల్లి చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ రైతులతో కలిసి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఎటువంటి రుణమాఫీ చేయలేదని మాయమాటలు చెప్పి మభ్యపెట్టుతూ కాలం గడిపిందని ఆరోపించారు. మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలలో మూడు గ్యారంటీలు అమలుపరచిందని, రైతులకు సీఎం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖులోగా అవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికెని దయానంద్ , జనరల్ సెక్రెటరీ షబ్బీర్ భాషా , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు పరిమి సురేష్ , అమనుల్ల ఖాన్ , కిషోర్ నాయక్ , పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *