MLA Vedma Bojju Patel:ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, సిరికొండ‌
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* శివాలయ రోడ్డు పనులకు భూమి పూజ

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం సిరికొండ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.ముందుగా శివాలయానికి రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోందన్నారు.పేదల సంక్షేమానికి పెద్దపిట వేస్తున్న ఎకైక ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. త్వరలో కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, త్వరలో 2500 వేలు అందజేస్తామన్నారు.పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం వరమని పేర్కొన్నారు.గతంలో ఇచ్చిన మాట ప్రకారం శివాలయానికి రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.త్వరలో ప్రతి గడప గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.ఇటీవల మృతి చెందిన ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్మీ జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పటేల్ లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *