సిరాన్యూస్, ఉట్నూర్
ఇంద్రవెల్లి స్తూపానికి పర్యాటక శోభ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
* నాగోబా, అమర వీరుల స్తూప అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
అన్ని హంగులతో ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపాన్ని పర్యటక కేంద్రంగా అద్భుతంగా తీర్చిదిద్దెందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయాలు, అదే విధంగా నాగోబా ఆలయ అభివృద్ధికి కోటి రూపాయాలను మంజూరు చేసిందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ – జిల్లా సార్మెడిలు, రగల్ జెండా కమిటీ,మెస్రం వంశీయులతో, అధికారులతో సమావేశమై పలు అభివృద్ధి విషయాలపై సుదీర్ఘంగా చర్చించి, పెద్దల సలహాల, సూచనల పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి అమర వీరుల స్తూపంతో పాటు నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చారని, నేడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు 1 కోటి రూపాయలను మంజూరు చేశారని పేర్కొన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోందన్నారు.అమర వీరుల స్తూపం వద్ద పర్యటకులను ఆకర్షించేందుకు అన్ని రకాల మొక్కలు,చెట్లను నాటడం జరుగుతుందని తెలిపారు.స్తూపం చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయడంతో పాటు నీటి సౌకర్యం కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. అదే విధంగా నాగోబా ఆలయ అభివృద్ధికి 1 కోటి రూపాయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.మెస్రం వంశీయులు, దేవాదాయ శాఖ నాగోబా ఆలయంలో చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించి నివేదికలు తమకు ఇస్తే త్వరలో పనులను చేపట్టడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, జిల్లా సార్మేడిలు, రగల్ జెండా కమిటీ, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.