MLA Vijayaramana Rao: త్రివేణి రైస్ మిల్లును సందర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరాన్యూస్‌, ఓదెల
త్రివేణి రైస్ మిల్లును సందర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలోని త్రివేణి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శుక్రవారం విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జ‌రిగింది. మిల్లులో ఉన్న‌ వరి ధాన్యం అధిక మొత్తంలో కాలిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శనివారం రైస్ మిల్లును సందర్శించారు. మిల్లులో కాలిపోయిన వరి ధాన్యంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైస్ మిల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *