సిరా న్యూస్, లోకేశ్వరం:
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
బాధిత కుటుంబాలను ముథోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. లోకేశ్వరం మండలం గడ్చందా గ్రామంలో బీజేపీ కార్యకర్త డి.దేవేందర్ మాతృమూర్తి, అలాగే కాసు సంతోష్ తండ్రి ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న
ఎమ్మెల్యే సోమవారం వారి నివాసాలకు వెళ్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.