సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో గల ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షర అభ్యాసం కార్యక్రమాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభిపంచారు. ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీటీసీలు మంజుల శ్రీశైలం, మాధవి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, మాజీ సర్పంచ్ చిన్న రాములు హజరయ్యారు. మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
=====