సిరా న్యూస్,ఖమ్మం;
సింగరేణి బాధితులకు న్యాయం జరగకపోతే సింగరేణి యాజమాన్యంతో పోరాటానికైన సిద్ధమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి మండలం – కిష్టారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల గ్రామం కాలనీల్లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితుల ఇళ్ళను ఎమ్మెల్యే పరిశీలించి,వారితో మాట్లాడారు.బాంబ్ బ్లాస్టింగ్ శబ్దాలతో పగిలిపోయిన ఇల్లులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న కిష్టారం ప్రజలకు వర్షాలు శాపంగా మారాయన్నారు. బాంబ్ శబ్దాలకు ఇల్లు పై కప్పు లు, ఇంటి గోడలు కూలిపోవటంతోపాటు కిష్టారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ” పునరావాస ” కేంద్రం ఏర్పాటు చేశారన్నారు.పునరావాస కేంద్రాల్లో ఉంటున్న
కిష్టారం నిరాశ్రయులను సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ… సింగరేణి బాంబు బ్లాస్టింగ్ ల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని… లేకుంటే సింగరేణితో కొట్లాదెందుకు సిద్ధమని అన్నారు. సింగరేణి బాధితులు మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాయ మాటలు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే మోసపూరిత హామీలు వల్ల ఈరోజు కిష్టారం గ్రామ కాలనీ లో ఉండటానికి నిలువు నీడ కూడా లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్చి వస్తుందన్నారు. సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ ల వల్ల ఇళ్ళు కూలి ఎన్ని ప్రాణాలు పోతాయో అని బయపడుతున్నాము అని ఎమ్మెల్యే , సత్తుపల్లి సింగరేణి అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు, సింగరేణి ఆఫీస్ లు చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదని, ముకుమ్మడిగా వారి ఆవేదన ను ఎమ్మెల్యేకి తెలియజేసారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ కిష్టారం ప్రజలు బాధలు మా ఇంటి బాధగా భావించి మీ కష్టాల్లో తోడుగా ఉంటాము హామీ ఇచ్చారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుండి, ఈరోజు వరకు సింగరేణి యాజమాన్యంతో… అధికారులు తో మీ ఇబ్బందులు, హామీలు గురించి మాట్లాడుతున్నామని తెలిపారు.. రెండు నెలల్లో సింగరేణి యాజమాన్యం సింగరేణి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యకపోతే అందరి కంటే ముందు మీతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రిలు, సింగరేణి సీఎండీ, ఖమ్మం జిల్లా కలెక్టర్ కి, సింగరేణి యాజమాన్యం కు తెలియజేసి బాధితులకు న్యాయం చెయ్యటానికి కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు. అనంతరం కిష్టారం గ్రామం లో కూలిన ఇల్లును, గోడలు పగిలిన ఇల్లును ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.