సిరా న్యూస్,జగిత్యాల;
పట్టణంలోని బీట్ బజార్ లో పల్లెరుచుల్ పికిల్స్ ప్రొడక్ట్ సెంటర్ ను బుధవారం కరీంనగర్ పట్టభధ్రలఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్ తోకలసి ప్రారంభించారు..ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధం అయిన ఎ పరిశ్రమనైనా ఉత్పత్తి ఎంత ప్రాధాన్యత సంచరించుకుంటదో మార్కెటింగ్ కూడా అంతే ప్రదానం ఉత్పత్తి తో ఎంత ఆదాయం పొందుతమో మార్కెటింగ్ తో అంతకంటే రెట్టింపు ఆదాయం పొందుతాం ఆన్నారు.మార్కెటింగ్ ద్వారా పొందే ఆదాయాన్ని ఉత్పత్తిదారుడే పొందగలిగినట్టయితే మెరుగైనటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుందన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి వివిధ రకాలైనటువంటి సహకారాలు లభిస్తున్నాయిని,జగిత్యాల ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి చిన్నచిన్న పారిశ్రామికవేత్తలు రైతాంగం ముందుకు రావాలని, సురేష్ స్వయంగా ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని పాల ఉత్పత్తి చేసుకుంటూ పల్లెరుచుల్ పికిల్ ప్రారంభించడం అభినందనీయం ఆన్నారు.వారి కుటుంబ సభ్యులు వ్యవసాయంతో పాటు వ్యాపారాలలో తోడు నిలవడం అభినందకరం అన్నారు. సురేశ్ వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.
వారి వెంట కౌన్సిలర్ దుర్గన్న, మాజీ కౌన్సిలర్స్ బింగిరవి,రజనీకాంత్, తదితరులు ఉన్నారు.