ముద్రగడను కలిసిన ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ

ముద్రగడ మహోన్నతమైన వ్యక్తి

పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు

రాష్ట్ర భవిష్యత్తు కోసమే ముద్రగడ వైసీపీలోకి వచ్చారు

ముద్రగడ ప్రభావంతో రాష్ట్రంలో వైసిపి విజయం సాధిస్తుంది.

ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ

సిరా న్యూస్,కిర్లంపూడి…

కిర్లంపూడి ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ శెట్టిబలిజిల ఆత్మీయ సమావేశం ముద్రగడ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం నీతి నిజాయితీ గల మహోన్నతమైన వ్యక్తి అని, పదవుల కోసం అధికారం కోసం రాకులాడే వ్యక్తి కాదని కూడిపూడి సూర్యనారాయణ రావు పేర్కొన్నారు.

ముద్రగడ కొన్ని దశాబ్దాల కాలం నుండి రాజకీయంలో మంచి పదవుల పొంది పదవులను సైతం రాజీనామా చేసిన వ్యక్తి అని, ఈ రోజుల్లో పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తులు ఉన్నారని ఇటువంటి సమయంలో పదవులతో పని లేకుండా ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్ చేసిన సంక్షేమ పథకాలకు ముద్రగడ ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు.

రాష్ట్రంలో శెట్టిబలిజిలు బీసీలు ఎక్కడ ఉన్న అందరూ ఏకతాటిపై కొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ ను గెలిపించాలన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసిందని చంద్రబాబు బీసీలను మోసం చేసి పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు తీరుపై సూర్యనారాయణ మండిపడ్డారు.

ముద్రగడ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో శెట్టి బలిజ కులస్తులందరూ పిఠాపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముద్రగడ తన నివాసానికి వచ్చిన శెట్టి బలిజ వర్గీయులకు ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు

ముద్రగడ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అభిమానంతో మీరందరూ వచ్చి నాకు మద్దతు తెలియజేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు

పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసి వైయస్సార్ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే, ఎంపీగా, వంగా గీతా, చలమల శెట్టి సునీల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *