బోథ్, సిరా న్యూస్
తెలంగాణ రాష్టం లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం కోసం జనవరి 12వ తేదీన ఒక ప్రకటన జారీ చేశారు. శుక్రవారం అధికారులు మరోమారు పత్రికలకు విడుదల చేశారు. ఆన్ లైన్లో దరఖాస్తులు ఫిబ్రవరి 22 వ తేది వరకు అందజేయొచ్చని తెలిపారు. ఏప్రిల్ ఒకటవ తేది రోజు హాల్ టికెట్లు అన్ని తరగతులు 6 నుంచి 10వ తరగతి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీలు ఉండగా మిగతా తరగతులలో ఖాళీలను బట్టి సీట్లు కేటాయించనున్నారు. పరీక్షలు ఏప్రిల్ 7న ఉంటుందని, 6వ తరగతి వారికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతులకు పగలు 2 నుంచి 4 గంటల వరకు వారికి కేటాయించారు. ఆయా కేంద్రాలలో పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్ష రుసుము బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ & ఈ డబ్ల్యూ ఎస్ వారికి రూ. 125లు, ఓసీ అయితే రూ. 200 చెల్లించాలి. ఆన్ లైన్లో దరఖాస్తు చేయవచ్చన్నారు. విద్యార్థి పాస్ ఫొటో, ఆధార్ కార్డు, బోనాఫైడ్ సర్టిఫికెట్ జతపర్చాలి. ఆన్ లైన్ దరఖాస్తు కు అధికారిక వెబ్ సైట్ http:/telanganams.cgg.gov.in లో నమోదు చేసుకోవాలి. 6 వ తరగతిలో ప్రవేశ పొందడానికి 5వ తరగతి లోని పాఠ్యాంశాల మీద మల్టీపుల్ ఛాయిస్ లో ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక 7-నుంచి 10 వ తరగతులకు పూర్వ తరగతిలోని పాఠ్యాంశాలమీద ప్రశ్నలు ఉంటాయి. గణితం, తెలుగు, ఆంగ్లంలకు 25 చొప్పున మార్కులు, సోషల్ &సైన్స్ లకు 25 మార్కుల చొప్పున 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.