– ఆర్ఈఎస్ఎల్ సీహెచ్ఆర్వో సుజీవ్ నాయర్
సిరా న్యూస్,పరవాడ;
ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం అనివార్యంగా మారిందని రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్ సీహెచ్ఆర్వో డాక్టర్ సుజీవ్ నాయర్ అన్నారు. తమ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన అనంతరం ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లి ఉద్యోగం చేయటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. పాఠశాలకు మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచే విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందిస్తామని రామ్కీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎమ్వీ రామిరెడ్డి ప్రకటించారు. వేదికపై నుంచి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన విద్యార్థులను, పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. సీడబ్లూఎంపీ హెడ్ కె.రవికుమార్, ఫౌండేషన్ ప్రతినిధి కె.శ్రీకాంత్ మాట్లాడుతూ సస్టెయినబిలిటీ లిమిటెడ్ సౌజన్యంతో పరిసర గ్రామాల్లో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకేశ్వేరరావు, కమిటీ చైర్ పర్సన్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు విక్టోరియా ఫ్రాన్సిస్, అన్నాజీరావు తదితరులు మాట్లాడారు.