సిరా న్యూస్, భీమదేవరపల్లి
మోడీ, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం
* నిధుల ప్రొసీడింగ్ కాపీ లు అందజేత
నిత్యం ప్రజల కోసం ఆరాటపడుతున్న ప్రధాని నరేంద్రమోడీ, బండి సంజయ్ చిత్ర పటాలకు భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా కోమటిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి మాట్లాడారు. భీమదేవరపల్లి మండలం అభివృద్ధి కోసం ఎంపీ నిధులను 23 లక్షలు స్వంత నిధుల నుండి కేటాయించారన్నారు. గట్లనర్సింగాపూర్ గోసంగి కాలనీ కి 5 లక్షల రూపాయలు, భీమాదేవరపల్లి గ్రామం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ కి 3.00.000 రూపాయలు, ఓపెన్ జిమ్ కు 3లక్షలు, గౌడ కమ్యూనిటీ కి 3 లక్షలు, బొల్లంపల్లి గ్రామంలో 3లక్షలు ఓపెన్ జిమ్, మల్లారం గ్రామానికి ఓపెన్ జిమ్ 3 లక్షలు, ముల్కనూర్ కమ్యూనిటీ హాల్ కు 3 లక్షలు కేటాయిస్తూ ప్రొసీడింగ్ కాపీ లు సంబంధిత వారికి ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిదంగా ఎంజీఎన్ ఆర్ ఈజీఎస్ 16 గ్రామాలకు ఒక కోటి డెబ్భై అయిదు లక్షలు కేటాయించి భీమదేవరపల్లి మండలం అభివృద్ధి కోసం కేటాయించారు.