-ఈటల
-ఈటలమేడ్చల్;
ఎన్డీఏ 400సీట్లు కైవసం చేసుకొని మోడీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ బోయిన్ పల్లి ప్రియదర్శిని హోటల్ నుండి దుబాయి గేట్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఈటలకు బీజేపీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇచ్చిన హామీలను అమలు పరచలేదని అన్నారు. రాష్ట్రంలోనే హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ దేశంలో ఏమి చేయలేదని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసంభవమని చెప్పారు. దేశం ప్రగతి శీలంగా, ప్రశాంతంగా ఉండాలంటే మోడీ మరొక్కసారి ప్రధాని కావలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
================