మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
సిరా న్యూస్,సూర్యాపేట;
హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి హఠాత్తుగా బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది…నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కండువా కప్పుకున్నా. తెలంగాణ లో మోడీ గాలి వీస్తుంది…10 నుంచి 12 ఎంపి సీట్లు బిజెపి గెలుస్తుంది. కేంద్రంలో మళ్ళీ బీజేపీదే అధికారం.. మోడీనే మళ్ళీ ప్రధాని అవుతారు. బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడి పోతున్నారు…ఆర్ధిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి కూడా బ్యాకయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారు….ఆ వ్యతిరేక బ్యాచ్ కు బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తారు….ఈ కుట్రలు,కుతంత్రాలు మనకు అవసరమా ? మీకు తెలియకుండా పార్టీ మారినందుకు క్షమించండి….మీరంతా నన్ను నమ్ముకుని పనిచేయండి. నేను హుజూర్ నగర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కు ఒక్క సర్పంచ్ కూడా లేడు…అలాంటి పార్టీని ఎక్కడికో తీసుకొచ్చాం. రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తా… కార్యాచరణ పై చర్చిస్తానని అనుచరులు,కార్యకర్తలను ఉద్దేశిస్తూ శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన వాయిస్ చక్కర్లు కొడుతోంది.