మహంకాళి అమ్మవారికి మోడీ పూజలు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానమంత్రి రానున్న వేళ సికింద్రాబాద్‌మొత్తం కట్టిదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. పన్నెండు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి పూజలు చేసే సందర్భంలో ఇద్దరిని మాత్రమేఆలయంలోకి అనుమతించారు. ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీకిపూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత హారతి అందజేశారు. శాలువాతో ప్రధానిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి, వేద ఆశీర్వదం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *