సిరాన్యూస్, శంకరపట్నం:
గంజాయి పై చర్యలు తీసుకోవాలి: ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షారుఖ్
గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తుందని మానకొండూరు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షారుఖ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు యుక్త వయస్సులో విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి మంచి పేరు తెస్తారని తల్లిదండ్రులు కలలు కంటుంటే చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని అన్నారు. మండలంలో ప్రతిరోజు పలు గ్రామాలలో రాత్రిపూట విచ్చలవిడిగా గంజాయి సేవిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి రాత్రి వేళలో గస్తీ కాస్తు గంజాయి విముక్తి నుండి యువతను కాపాడాలని కోరారు.