సిరాన్యూస్, జైనథ్
రైతులు మద్దతు ధర పొందాలి
* జిల్లా సహకార అధికారి మోహన్
* శనగ కొనగోలు ప్రారంభం
రైతులు మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి మోహన్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ లో రైతులు పండించిన శనగ పంటను కొనుగోలు కేంద్రాన్నిజిల్లా సహకార అధికారి మోహన్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2 వరకు కొనుగోలు కేంద్రం ఉంటుందని తెలిపారు. రైతులు తమ శనగ పంటను ప్రభుత్వ మద్ధతు ధరకు అమ్ముకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రెటరీ మధుకర్, పీఏసీఎస్ సీఈఓ గంగన్నపాల్గొన్నారు.