సిరా న్యూస్,చంద్రగిరి;
గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గం చెర్లోపల్లి ,పుదీపట్ల పంచాయతీ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మోహిత్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు,ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి వివరిస్తూ, తను ఎమ్మెల్యేగా గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు మోహిత్ రెడ్డి. ఎన్నికల బ్యాలెట్ లో ఒకటో నెంబర్ వైసిపి ఫ్యాన్ గుర్తుకు వచ్చిందని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.జగన్ పాలనలో నిర్వీర్యమైపోయిన వర్గాలన్నింటికీ జీవం పోసేలా తమ మేనిఫెస్టో ఉందన్నారు.