సిరా న్యూస్, సైదాపూర్:
నడి రోడ్డుపై గుంత.. పొంచి ఉన్న ప్రమాదం
సైదాపూర్ టు మొలంగూర్ ప్రధాన రహదారి పై కాకతీయ కెనాల్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. రెండు మండలాలను కలిపే ప్రధానమైన రహదారి. ఈ మార్గం గుండా నిత్యం అనేకమంది ప్రజలు వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బ్రిడ్జి వద్ద వాహనదారులు అనేకసార్లు ప్రమాదాలకు గురికావడం జరిగింది. ప్రభుత్వం, ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.