Moluguri Sampath: సామాజిక ఉద్యమ కెరటం మహాత్మా జ్యోతిరావు పూలే

సిరాన్యూస్‌, సైదాపూర్
సామాజిక ఉద్యమ కెరటం మహాత్మా జ్యోతిరావు పూలే

సామాజిక ఉద్యమ కెరటం మహాత్మా జ్యోతిరావు పూలే అని ప‌లు సంఘాల నాయ‌కులు అన్నారు. గురువారం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి స్మరించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సు కోసా అన్నారు.సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అన్నారు. భావి తరాలకు సైతం ఆయన్ గొప్ప మార్గదర్శకుడని అన్నారు. కార్యక్రమంలో మొలుగూరి సంపత్, మారపాక తిరుపతి, సంగాల తిరుపతి, కనకం శ్రీనివాస్, మొలుగూరి ఐలయ్య,రేగుల కుమారస్వామి, మునిగంటి సంపత్, మొలుగూరి కొంరయ్య, మొలుగూరి సమ్మయ్య, మొలుగూరి వెంకటయ్య, మొలుగూరి కిరణ్ కుమార్, మొలుగూరి సదయ్య సంగాల మహేష్, కనకం అజయ్, మొలుగూరి స్వామి, మారుపాక అర్జున్ మారుపాక ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *