బాధితుల అందోళన
సిరా న్యూస్,నాగార్జునసాగర్;
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారుల అకౌంట్ లో డబ్బులు మాయం అయ్యాయి. అక్కడ పోస్ట్ మాన్ గా పనిచేసిన రామకృష్ణపై ఖాతాదారులు పిర్యాదు చేసారు. పిర్యాదు చేసి పదిహేను రోజులు కావొస్తున్నా, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో.. హిల్ కాలనీ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. తమ ఖాతాలోని మొత్తం డబ్బులు.. వెంటనే తమకు చెల్లించాలని డిమాండ్ చేసారు. ..