సిరా న్యూస్, ఆదిలాబాద్:
నైతిక గెలుపు మాదే…
-డిసిసిబి డైరెక్టర్, కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి నైతికంగా విజయం సాధించారని డిసిసిబి డైరెక్టర్, కాంగ్రెస్ నాయకులు బాలురు గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పాలన అంతం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తామని అన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు సైతం పూర్తి అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు సామ రూపేష్ రెడ్డి, కొండూరు రవి, రవి, లింగన్న, మన్సూర్, రాజ్ మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.