పెద్దపెల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మోటం రవీందర్

 సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపెల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మోటం రవీందర్ బరిలో ఉన్నట్లు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ స్టేట్ కన్వీనర్ గా, ఆల్ ఇండియా బేడ బుడగ జంగం వెల్ఫేర్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా తవంతు సేవ చేస్తూ వస్తున్నానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మాల మాదిగల తర్వాత అత్యంత జనాభా 20 లక్షలుగా ఉన్నామని, తమ కులాన్ని తాము చేసిన పార్టీ సేవలను గుర్తించమని ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, ఉత్తంకుమార్ రెడ్డిలను కలిసి సమస్యలు తెలిపి వినతి పత్రాలు సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తమ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ అలాగే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు అవి కార్యరూపం దాల్చలేదని తమకు ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ, నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు గాని ప్రకటించలేదని, కాగా జాతీయ రాష్ట్ర కుల సంఘం నిర్ణయం మేరకు పెద్దపెల్లి ఎంపీగా తాను నిలుచున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను కలుపుకొని తమ సత్తా ఏంటో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చూపిస్తామని అన్నారు. మన సమస్యల పరిష్కారానికై మీ పెద్ద కొడుకుగా పెద్దపెల్లి ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *