సిరా న్యూస్,ఉయ్యూరు;
ఉయ్యురు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం 9:40 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి 65 పై మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు బోల్తా కొట్టింది. అటుగా మచిలీపట్నం వెళ్తున్న ఎంపీ బాలశౌరి గారు ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. తన అనుచరులను రంగంలోకి దించి హుటాహుటిన కారులో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. బాధితులతో ఎంపీ గారు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.