పంట నష్టాన్ని పరిశీలించిన ఎంపి బండి సంజయ్

సిరా న్యూస్,సిరిసిల్ల;
ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతు దెబ్బడ నారాయణ పొలాన్ని ఎంపి బండి సంజయ్ బుధవారం పరిశీలించారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.
తనకున్న 2 ఎకరాల పొలంతోపాటు మరో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నానని బాదిత రైతు నారాయణ చెప్పారు. అకాల వర్షాలతో 5 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, తాలుమాత్రమే మిగిలిందని నారాయణ కుటుంబం వాపోయింది. ఎకరాకు రూ.10 వేలు కౌలు పైసలివ్వడంతోపాటు పెట్టుబడి కింద రూ.లక్షన్నర ఖర్చు చేశానని నారాయణ ఆవేదన వ్యక్తం చేసింది. పంట నష్టంతో చేసినఅప్పులు తీరే పరిస్థితి లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని కన్నీటిపర్యంతమైయాడు కౌలు రైతు నారాయణ. బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని బండి సంజయ్ చెప్పారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *