మొదటిసారి అనకాపల్లికి వచ్చిన ఎంపి సీఎం రమేష్

 సిరా న్యూస్,విశాఖపట్నం;
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తిరుపతి నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయంకి చేరుకున్నారు. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి అయన అనకాపల్లికి వచ్చారు. అయనకు బిజెపి కార్యకర్తలు మరియు అభిమానులు నాయకులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి వెళ్లారు.
సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలు కూటమికి కసితో ఓట్లు వేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలను ఎంక్వయిరీ వేయిస్తాం. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. రైల్వే జోన్ ఏర్పాటు కృషి చేస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం. బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. విమానశ్రయం నుంచి అనకాపల్లి పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గాన బయలుదేరారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *