హైదరాబాద్ యూటీ పుకార్లను ఖండించిన ఎంపి ధర్మపురి

సిరా న్యూస్,హైదరాబాద్;
యాంకర్ – బీజేపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య లను ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.భవిష్యత్తులో మోడీ హయాంలో హైద్రాబాద్ మరింత వెలిగిపోతుందని చెప్పారు.కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థం విలువ రెండూ లేవని అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో జరిగిన యువ మహిళా సమ్మేళనంలో అరవింద్ పాల్గొన్నారు.మీ తొలి ఓటు ఎవరికి అంటూ ఇంజనీరింగ్ విద్యార్థినులకు ప్రశ్నలు వేస్తూ ఉత్తేజ పరిచారు.దేశంలో కాంగ్రెస్ కు 30సీట్లు దాటవని చెప్పారు.మొదటి ఓటు హిందూ యువత సెంటిమెంట్ అని ఆ ఓటు రామరాజ్యం స్థాపించిన మోడీ కే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *