సిరా న్యూస్,మేడ్చల్;
నీట్ పరీక్షతో పేద ప్రజలు ఇబ్బందులు గురయ్యారని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ అన్నారు. నెట్ పరీక్ష అవకతవకలు చేసిన పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల పిలుపుమేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించామని చెప్పారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వారిని సిబిఐ తో విచారణ చేయించి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘంల నాయకులు తదితరులు పాల్గొన్నారు